సుశాంత్ కు ఇప్పటికైనా న్యాయం చేయండి…. సుశాంత్ సోదరి

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి ఇప్పటికి రెండేళ్లు దాటిపోయింది అయితే ఈయన మరణించాక బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఇతనికి అండగా నిలిచారు అంతేకాకుండా ఎంత మంచి వ్యక్తి అయినా సుశాంత్ మరణానికి అసలు కారణం ఇంకేదో ఉంది అంటూ ఆరోపణలు చేశారు అయితే అప్పట్లో ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు తాజాగా ఈ విషయం మరొకసారి తెరపైకి వచ్చింది..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 2020 జూన్ 14న ముంబైలో తన ఫ్లాట్లో మరణించిన సంగతి తెలిసిందే అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనానికి దారితీసింది అయితే తాజాగా ఇతనికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ రూప్ కుమార్ సుశాంత్ సింగ్ కచ్చితంగా హత్యనని తెలిపారు అలాగే ఈయనని పోస్ట్మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు అతను శరీరం పైన మెడ పైన ఎన్నో గాయాలు ఉన్నాయని ఆ విషయాన్ని అక్కడ వారికి చెబితే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు అలాగే తొందరగా పోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ ఇవ్వండి అంటూ తొందర పెట్టారని చెప్పుకొచ్చారు..

అలాగే ఆయన శరీరం పైన గాయాలు ఉన్నాయని పూర్తిగా వీడియో తీయాలని చెబితే ఆ మాట ఎవరూ పట్టించుకోకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీశారని చెప్పారు అంతేకాకుండా పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు త్వరగా పోస్ట్మార్టం నిర్వహించామని తెలిపారు.. దీంతో సుశాంత్ మరణం పై అనుమానాలు నిజమయ్యాయి..

అయితే ఈ విషయంపై సుశాంత్ సోదరి అందించారు రూప్ కుమార్ చేసిన వ్యాఖ్యలను స్క్రీన్షాట్ జోడించి ఈ కేసును ఎలాగైనా సిపిఐ కు అప్పగించాలని కోరారు అంతేకాకుండా ఇందులో నిజ నిజాలు తెలుసుకోవడానికి మేమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నామని సుశాంత్ కు ఇప్పటికైనా న్యాయం చేయమని చెప్పారు..

Read more RELATED
Recommended to you

Latest news