తెలంగాణ ఇన్చార్జ్ డిజిపిగా అంజనీ కుమార్

-

తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్చార్జ్ డిజిపిగా అంజనీ కుమార్, సిఐడి ఎడిజీగా మహేష్ భగవత్, రాచకొండ సిపిగా చౌహాన్, ఏసీబీ డీజీఏగా రవి గుప్తా, తెలంగాణ హోం శాఖ కార్యదర్శిగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డిజిఏగా సంజయ్ కుమార్ జైన్, అగ్నిమాపక శాఖ డిజిఏ గా జితేందర్ రెడ్డి బదిలీ అయ్యారు.

ప్రస్తుత డిజిపి మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 31న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి డిజిపిగా అంజని కుమారును నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అంజనీకుమారి ఏసీబీ డీజీఏ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత డిజిపి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠ వీడినట్లు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news