రాజీనామా చేసిన గోవా పీసీసీ అధ్యక్షుడు

-

2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.  ఓటమికి గల కారణాలు మీద జాతీయ అధిష్ఠానం దృష్టి సారిస్తున్న సమయంలో పార్టీకి  మరో షాక్ తగిలింది.

గోవా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిరీష్ చోడంకర్ తన పదవికి రాజీనామా చేశాడు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 11 , ఆప్ 2 , ఇతరులు 7 సీట్లు సాధించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 

ప్రస్తుతం గోవా పీసీసీ పదవి కోసం ఆ పార్టీలోనే పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news