UP polls: ఇవాళ యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్

-

ఇవాళ ఉత్తర ప్రదేశ్, గోవా అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో… అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. యూపీ అలాగే గోవా రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు ఉత్తరాఖండ్ లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఉత్తరాఖండ్ అలాగే గోవా రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి అవుతాయి. ఉత్తరప్రదేశ్లో నేడు రెండో విడతలో 55 స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 586 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు అలాగే ఇందులో 69 మంది మహిళా అభ్యర్థులు ఉన్నాయి.

ఉత్తరాఖండ్ లోని 70 అసెంబ్లీ స్థానాల కు మొత్తం 632 మంది అభ్యర్థులు ఉన్నారు. అలాగే గోవా లో 40 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 301 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా… గోవాలో అలాగే.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ పార్టీ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news