గాడ్సే వారసులు గాంధీ వారసులను ఇబ్బంది పెడుతున్నారు – ఎమ్మెల్యే సీతక్క

-

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన ఆస్తుల కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇదివరకే సోనియాగాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి కూడా ఈడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఇప్పటికే ఈడి విచారణను ఎదుర్కోగా.. ప్రస్తుతం సోనియాగాంధీ ఈడి విచారణకు హాజరవుతున్నారు. గాంధీ కుటుంబం పై ఈడీ విచారణను నిరసిస్తూ నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..

సవార్కర్, గాడ్సేలా వారసులు గాంధీ వారసులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల పైనే ఈడి కన్ను వేసిందని, ఈడి బిజెపి అనుబంధ సంస్థలా కనిపిస్తోందన్నారు. దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళ పట్ల ఈడి కళ్ళు మూసుకుందని మండిపడ్డారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాని దోచుకున్నట్టు ఇప్పుడు కొందరు దోచుకుంటున్నారని, ప్రతి వస్తువుపై గబ్బర్ సింగ్ టాక్స్ వేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి దాని తొత్తు టిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news