పసిడి ప్రియులకి రిలీఫ్..!

-

బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్, బంగారం ధర ఈరోజు కూడా దిగొచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పసిడి రేటు పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు. దీనితో పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది అనే చెప్పాలి.

కానీ వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది. ఇక బంగారం ధర ఎలా వుంది అనేది చూస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గింది. దీంతో రేటు రూ.49,860కు క్షీణించింది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే తగ్గడం తో రూ.45,700కు దిగి వచ్చింది. ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరిగింది. 0.42 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1903 డాలర్లకు చేరింది.

ఇక వెండి అయితే రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్‌కు 0.43 శాతం పెరుగుదలతో 28.06 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి ప్రభావం బంగారం మీద పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news