నిరుద్యోగులకు శుభవార్త.. గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

-

నిరుద్యోగులకు మరో శుభవార్తనందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన టిజిటి, ఎస్జిబిటి, వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్, మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ అందుల గురుకుల పాఠశాలలు, కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్ లోని ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలలు. దివ్యాంగుల వసతిగృహాల్లో పని చేయవలసి ఉంటుంది.

ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 42 కాగా ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 15, ఎస్జిబిటి టీచర్ పోస్టులు 15, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 2, వార్డెన్ పోస్టులు 10. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేది జూలై 14, 2022. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా చేసుకోవచ్చు. [email protected]

Read more RELATED
Recommended to you

Latest news