ఏపీ మందుబాబులకు శుభవార్త..భారీగా ధరలు తగ్గింపు

-

ఏపీలో మందుబాబులకు శుభ వార్త అందించింది ఏపీ ప్రభుత్వం. అదేంటంటే ఏపీలో మద్యం ధరల్ని భారీగా తగ్గించింది. మద్యం ధరలు తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్ ని అబ్కారీ శాఖ విడుదల చేఇస్న్ది. ఐఎంఎఫ్ఎల్ లిక్కరుతో పాటు, విదేశీ మద్యంలోని మద్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరలని తగ్గించారు. రూ. 50 నుంచి రూ. 1350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరల తగ్గిస్తూ ఆదేశాలు జరీ అయ్యాయి. రేపట్నుంచే తగ్గించిన మద్యం ధరలు అమలు కానున్నాయి.

అయితే బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. రూ. 200 రూపాయల్లోపు క్వార్టర్ బాటిల్ ధరలపై కూడా ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం పేర్కొంది. బ్రాండ్లు, బాటిళ్ల పరిమాణాలను అనుసరించి 90 ఎంఎల్ కు రూ. 50 రూపాయల నుంచి లీటరు మద్యం ధర రూ. 1350 వరకూ తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్ఈబీ నివేదిక ఆధారంగా మద్యం ధరల తగ్గించినట్టు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఈ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news