స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను ఇస్తోంది. అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్ ని బ్యాంక్ చెప్పింది. FDపై బంపర్ వడ్డీని పొందచ్చని బ్యాంక్ అంది. పెన్షనర్లు ఇప్పుడు 5 నుండి 10 సంవత్సరాల కాలంలో 7.65% వడ్డీని పొందవచ్చు.

ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 1% అదనపు వడ్డీని పొందచ్చట. ఎఫ్‌డిలను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. అన్ని పదవీ కాలానికి ఈ పెంపుని మార్చారు. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డిలపై ఇది వర్తిస్తుందని బ్యాంక్ అంది. అక్టోబర్ 15, 2022 నుండి ఇవి అమలులోకి వచ్చాయి.

వడ్డీ రేట్లు 10 నుండి 20 బేసిస్ పాయింట్లు పెరిగాయని బ్యాంక్ అంటోంది. FD రేట్ల సవరణ తర్వాత సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ ఏళ్లకు వడ్డీ రేటు 6.65%కి పెరిగింది. అదే సాధారణ ప్రజలకు అయితే 3.00% నుండి 5.85% పెరిగింది. 7 రోజుల FDలపై వడ్డీ 2.90 శాతం నుండి 3 శాతానికి చేరింది.

46 రోజుల నుంచి 179 రోజులకు నాలుగు శాతానికి వెళ్ళింది. 180 నుంచి 210 రోజులకు 4.65 శాతానికి పెరిగింది. వడ్డీ రేటును ఫిక్సెడ్ డిపాజిట్లకు 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ నుండి 4.70 శాతానికి తగ్గించారు.

ఏడాది నుండి రెండేళ్ల లోపు వాటికి 5.45 శాతం నుండి 5.60 శాతానికి పెంచారు. రెండేళ్ల నుండి మూడేళ్లకు 5.65 శాతం వడ్డీ ఇస్తున్నారు. మూడు నుండి ఐదేళ్లకు 5.80 శాతానికి పెరిగింది. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు వడ్డీ 5.85 శాతానికి పెంచేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news