గవర్నర్ బిజెపి కార్యకర్తలా పనిచేస్తున్నారు – మంత్రి జగదీష్ రెడ్డి

-

గవర్నర్ తమిళిసై పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి జగదీష్ రెడ్డి. గవర్నర్ గవర్నర్ గా కాకుండా బీజేపీ కార్యకర్తలా పని చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ రాజకీయం చేస్తుందని.. బీజేపీ మొదటి కార్యాలయం నాంపల్లిలో ఉంటే రెండవ కార్యాలయం రాజ్ భవన్ లో ఉందని వ్యాఖ్యానించారు.

మునుగోడులో ఓడిపోయిన అక్కసుతోనే నిన్న మోడీ మాట్లాడినట్లు ఉందన్నారు జగదీశ్ రెడ్డి. మోడీ తెలంగాణకు ఇచ్చింది ఏమి ఉందని ప్రశ్నించారు. నయా పైసా ఇవ్వకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. మోడీ చెప్పేవి అన్ని అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు బిఆర్ఎస్ తో దేశం అంత ప్రచారం చేస్తామన్నారు. ఆరు బిల్లులను గవర్నర్ ఆమోదించకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news