రాజధాని రైతుల పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుంది – రఘురామకృష్ణరాజు

-

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కొనసాగిస్తున్న అమరావతి టు అరసవిల్లి మహాపాదయాత్ర గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మంగళవారం లేఖ రాశారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రులు మూడు రాజధానులపై మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అమిత్ షా కీ రాసిన లేఖలో పేర్కొన్నారు. అమరావతి విషయంలో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోందని తెలిపారు.

రాజధాని రైతులు చేపడుతున్న వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. కేంద్ర సంస్థల ద్వారా పర్యవేక్షణ, భద్రతా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యాత్రకు ముందు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట ఓ యాత్ర చేసిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రపై అమిత్ షా కు రఘురామారాజు లేఖ రాయడంం ప్రాధాన్యం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news