ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది – సోము వీర్రాజు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. సలహాదారులకు సకాలంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ఉద్యమానికి బిజెపి మద్దతు ఉంటుందని, పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

సలహాదారుల జీతాలు, వాళ్ల విధులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉద్యోగులపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఇక జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని తెలిపారు సోము వీర్రాజు. జనసేనతో బిజెపి కాపురం బాగుందని, ఆ పార్టీ శ్రేణులు తమకే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపితో కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గతంలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news