హైదరాబాద్ కు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

-

సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్లు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.

విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ బి. శరత్, జస్టిస్‌ సీవీ భాస్కర్ రెడ్డి, జస్టిస్ సాంబశివరావు, జస్టిస్ చిన్నకూరి సుమలత, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ ఎన్.సుధీర్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, భాస్కర్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో ‘రసమయి-డాక్టర్‌ అక్కినేని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ను జస్టిస్‌ రమణ అందుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news