BREAKING : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు బిగ్‌ షాక్‌..ఈడీ నోటీసులు జారీ

-

నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదని కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడి నోటీసులు అందాయని ఇవాళ ఉదయం నుంచే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ కీలక నేతలైన షబ్బీర్ అలీ …సుదర్శన్ రెడ్డి… రేణుకా చౌదరిలకు నేషనల్‌ హెరాల్డ్‌ స్కాం కింద నోటీసులు అందినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. 10 న ఢిల్లీలో ఈడి ముందు హాజరు కావాలని నోటీసులు అందాయని వార్తలు వస్తున్నాయి.

అయితే.. ఈడీ నోటీసులు జారీపై షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నుంచి నాకు ఏలాంటి నోటీసులు రాలేదు..నోటీసులు వస్తే విచారణకు హాజరవుతాన్నారు. నేను నేషనల్ హెరాల్డ్ కి డొనేషన్ ఇచ్చిన మాట వాస్తవమేనని… నాతో పాటు పార్టీ నేతలు మరో ముగ్గురు నలుగురు కూడా ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఈడి నుండి నోటీస్ లు రాలేదు..ఫిజికల్ గా గానీ, మెయిల్ ద్వారా కానీ అందలేదని వెల్లడించారు షబ్బీర్‌ అలీ.

Read more RELATED
Recommended to you

Latest news