గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెలబ్రీటీలు, తారలు, రాజకీయ నాయకులే కాకుండా.. పక్కన ఉన్న రాష్ట్రాల నేతలు సైతం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. గ్రీన్ఇండియా చాలెంజ్ ను స్వీకరించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా సీనియర్ జర్నలిస్ట్ స్వప్న విసిరిన చాలెంజ్ స్వీకరించి హైదరాబాద్ శ్రీ నగర్ కాలనిలో మొక్క నాటారు ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news