ఏపీ రైతులకు శుభవార్త.. పప్పు ధాన్యాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్

-

ఏపీ రైతులకు శుభవార్త. పప్పు ధాన్యాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత రబీ సీజన్ లో పప్పుధాన్యాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా 1,22,933 టన్నుల శనగలు, 99,278 టన్నుల మినుములు, 45,864 టన్నుల వేరుశనగ, 19,403 టన్నుల పెసలను సేకరించనుంది.

ఇప్పటికే శనగల కొనుగోలు ప్రారంభించగా, ఏప్రిల్ 1 నుంచి మిగతా పప్పుధాన్యాల కొనుగోలుకు మార్క్ ఫెడ్ ఏర్పాటు చేసింది. ధరలు ఇలా(క్వింటా).. శనగలు-రూ.5,335: పెసలు-రూ.7,755: మినుములు-రూ.6,600: వేరుసెనగ-రూ.5,850 గా నిర్ధారించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news