ఓ స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతోనే టీడీపీలో చేరుతున్నా : గోవ‌ర్ధ‌న్ రెడ్డి

-

ఏపీలో వైసీపీకి షాక్‌ తగిలింది. వైసీపీలోని ఓ కీలక నేతల టీడీపీలో చేరారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైసీపీ కీల‌క నేత గుదిబండ గోవ‌ర్ధ‌న్ రెడ్డి అధికార పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి విప‌క్ష టీడీపీలో చేరిపోయారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు… గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచరుల‌కు పార్టీ కండువాలు క‌ల్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా గోవ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ స‌ర్కారుపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భ‌విష్య‌త్తు ఉండ‌ద‌న్న భావ‌న‌లో ప్ర‌జ‌లు ఉన్నార‌ని, ఓ స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నాన‌ని పేర్కొన్నారు గోవ‌ర్ధ‌న్ రెడ్డి.

వైసీపీని వీడి టీడీపీలో చేరిన గోవ‌ర్ధ‌న్ రెడ్డి... సాద‌రంగా ఆహ్వానించిన  చంద్ర‌బాబు

దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకట‌రెడ్డి సోద‌రుడి కుమారుడే గోవ‌ర్ధ‌న్ రెడ్డి. ప‌దేళ్ల‌పాటు వైసీపీలో కొన‌సాగిన ఆయ‌న తాజాగా టీడీపీలో చేర‌డం గ‌మ‌నార్హం. గోవ‌ర్ధ‌న్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్ర‌బాబు… జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ ప్ర‌భుత‌మ్వ అరాచ‌కాల‌ను ఆ పార్టీ నేత‌లే తట్టుకోలేక‌పోతున్నార‌ని ఆరోపించారు చంద్ర‌బాబు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆ పార్టీని వీడ‌ట‌మేన‌న్నారు చంద్ర‌బాబు. మ‌న‌సున్న కార్య‌కర్త‌లు వైసీపీలో కొన‌సాగేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని కూడా చంద్ర‌బాబు అన్నారు చంద్ర‌బాబు.

 

YSRCP, Gudibanda Govardhan Reddy, Latest News, TDP, Breaking News, Chandrababu

Read more RELATED
Recommended to you

Latest news