రాజధాని విశాఖ పై కేంద్రం ఆసక్తికర సంకేతం !

-

కేపిటల్ వైజాగ్ దిశగా కేంద్రం నుంచి ఆసక్తికరమైన సంకేతం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు. పార్లమెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్ లో ఏపీ కేపిటల్ ను వైజాగ్ గా గుర్తింపు ఇచ్చిందని…. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరల పై ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని సపస్తం చేశారు.

జులై 26 న జరిగిన పార్లమెంటరీ సమావేశా ల్లో వైసీపీ ఎంపీలు ప్రశ్నను లేవనెత్తారని వెల్లడించారు. రాష్ట్రాల రాజధానుల్లో ధరల వివరాలు వెల్లడిస్తూ ప్రకటన చేసిందని.. ఈ జాబితాలో ఏపీ కేపిటల్ స్థానంలో వైజాగ్ గా కేంద్రమే పేర్కొన్నదని ఆయన వివరించారు.. మూడు రాజధానుల పై ప్రచారాలు చేస్తున్న వారికి ఇదే సమాధానమని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి తిరుగులేదని… ఎవరు ఎన్ని మాట్లాడిన వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిపాలన ప్రారంభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news