చంద్రబాబుపై గుడివాడ అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు…

-

ఈ రోజు ఏపీ ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మరియు మాజీ ఏపీ సీఎం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు రాజధానిగా అనుకున్న అమరావతి లో ఎంత కుంభకోణం జరిగిందో అందరికీ తెలిసిందే. దీనిని దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు అన్నారు. మాములుగా అప్పుడు రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే ఈ భూ దోపిడీకి చంద్రబాబు అండ్ కో పాల్పడ్డారన్నారు. ఈ అమరావతి భూముల దోపిడీ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనీ చంద్రబాబు పక్క ప్లాన్ తో ఉన్నారు.

ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈ అక్రమాలన్నీ తవ్వి బయటకు తీస్తుంటే జైలుకు ఎక్కడ వెళ్లాలో అని తెగ భయపడుతున్నారంటూ ఛలోక్తులు విసిరారు. ఒకవేళ చంద్రబాబు ఏపీ ప్రహాలకు మంచి చేసి ఉంటే ఎందుకు ఎన్నికల్లో కేవలం సీట్ లకే పరిమీతం చేశారు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news