మరో వివాదంలో చిక్కుకున్న మంత్రి జయరాం.. చిప్పగిరిలో గొర్రెల కాపరుల పై దాడి !

-

నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం మరో సారి వార్తల్లోకి ఎక్కారు. దీంతో చిప్పగిరిలో ఉద్రిక్తత నెలకొంది. గొర్రెల కాపరులపై మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ అనుచరులు దాడి చేసినట్టు చెబుతున్నారు. వాహనాలకు గొర్రెలు అడ్డు రావడంతో నారాయణ సమక్షంలో  గొర్రెల కాపరులపై అనుచరులు దాడి చేసినట్టు చెబుతున్నారు.

తిరుగు ప్రయాణంలో దాడి ఎందుకు చేశావని ప్రశ్నించిన వారిపైనా కూడా నారాయణ అనుచరులు దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడిని నిరసిస్తూ చిప్పగిరి అంబెడ్కర్ విగ్రహం ముందు గొర్రెల కాపరుల ఆందోళనకు దిగారు. మంత్రి సోదరుడు నారాయణ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుంతకల్లు- ఆలూరు మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news