గుంటూరు ఘటన దురదృష్టకరం – పవన్ కళ్యాణ్

-

ఆదివారం గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుమారు 30 వేల మందికి జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన అనంతరం కానుకలు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

దీంతో ఘటన స్థలంలోనే ఓ మహిళ మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో దురదృష్టకరమని.. ముగ్గురు పేద మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు తగిన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news