2024లో వైసీపీ పతనం ఖాయం.. మేం తగ్గేదే లేదు : బిజెపి ఎంపీ

-

2024 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని.. మేము తగ్గేదే లేదని హెచ్చరించారు బిజేపి ఎంపి జి.వి.ఎల్. నరసింహరావు. విజయవాడ లో ప్రజాగ్రహ సభ చాలా పెద్ద సక్సెస్ అయిందని.. బీజేపీ అంటే లెక్కలేని తనంగా ఉన్న పార్టీలకు నిన్నటి సభ మేలుకొలుపు అని పేర్కొన్నారు. ఆయా పార్టీ లకు ఓ రకంగా భయం కలిగేలా సభ జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో తేటతెల్లమైందని పేర్కొన్నారు.

టీడీపి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ—రెండు పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని.. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ స్వార్థం దాగి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగి వేసారి పోయారని.. సజ్జల రామ కృష్ణ రెడ్డి….మీ పరిస్థితి గల్లంతు అని అర్థం చేసుకోండని వెల్లడించారు. వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని.. అవినీతి ఎత్తి చూపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుందని చురకలు అంటించారు. అవినీతి తోలుతిసే పార్టీ బిజేపి అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బురద జల్లే కార్యక్రమం విరమించుకోకపోతే ఇంకా తీవ్రంగా ఉంటామని వెల్లడించారు. మీ ఆట కట్టిస్తుంది బిజేపి. మీ కుట్ర రాజకీయాలు ఇక నడవవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news