కన్నా రాజీనామాపై స్పందించిన జివిఎల్

-

ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే పార్టీని వీడుతున్నానని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఆయన వల్లే పార్టీలో ఇమడలేకపోయారని.. పార్టీతో చర్చించకుండా జిపిఎల్ ఇస్టారీతిన వ్యవహరిస్తున్నారని కన్నా ఆరోపించారు. అయితే కన్నా రాజీనామా, ఆయన చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కన్నాకు పార్టీలో సముచిత గౌరవం ఇచ్చినట్లు వెల్లడించారు. కన్నా రాజీనామా పై అధిష్టానంతో మాట్లాడినట్లు జీవీఎల్ తెలిపారు. ముఖ్యంగా రాజీనామాకు బిజెపి చీఫ్ సోము వీర్రాజు వైఖరి కారణమని, ఆయన ప్రవర్తన నచ్చలేదని కన్నా అనడంపై జివిఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని విమర్శించారు. అధిష్టానంతో సంప్రదించాకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తెలిపారు జీవీఎల్.

Read more RELATED
Recommended to you

Latest news