పదో తరగతి బాలికపై జిమ్ ట్రైనర్ అత్యాచారం

-

వరుస అత్యాచారాలతో దేశం మొత్తం ఊక్కిరిబిక్కిరి అవుతుంది. కామాందులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వీళ్ళనుండి అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా పదవ తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన జిమ్ ట్రైనర్ పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గాజులరామారంలోని ఓ బాలిక స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఇంటి సమీపంలో నివసించే విశ్వ (23) ఓ జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు.

కాగా అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక (14) తో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో విశ్వక్ బాలికతో ఉన్న చనువుతో బాలికను గత నెల 29వ తేదీ ఇంటి నుంచి తీసుకువెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలిక రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

కాగా శుక్రవారం బాలికను ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోయాడు విశ్వక్. బాలికని తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news