గవర్నర్ తమిళిసై పై హరీష్ రావు సీరియస్..మీకేం తెలుసు !

-

గవర్నర్ తమిళిసై పై హరీష్ రావు సీరియస్..అయ్యారు. రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీరు విమర్శిస్తున్నారు..సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.

ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి వెళ్లి చూడండి, కనీస వసతులు కూడా లేవని.. గవర్నర్ గారు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిని ఒక్కసారి వెళ్లి చూడండని చురకలు అంటించారు. ఇదే సమయంలో మా తెలంగాణ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు చూడండి… తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో 10 పైసలు కూడా ఏమ్స్ లో లేవని తెలిపారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైంది. పేషెంట్లు లేరు డెలివరీలు కావు. కనీస సౌకర్యాలు ఉండవు.డాక్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news