దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసుకు సంబంధించి హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలంటూ ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సిట్‌ ఏర్పాటును నిలిపి వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలాడిన మఠాధిపతులు, స్వామిజీలు తమకు తెలియదని చెప్పిన బీజేపీ ఇప్పుడు కోర్టుల మెట్లు ఎందుకు ఎక్కుతోందని ప్రశ్నించారు.