బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి !

-

ఈరోజు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో రాష్ట్ర బిజెపి దళిత మోర్చ కౌన్సిల్ మెంబెర్ ఎల్లం ( ఎల్లయ్య)తో పాటు దాదాపు 150 మంది టిఆర్ఎస్ లో చేరారు. ఈ సంధర్భంగా మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు. సముద్రం అంత సాయం కేసీఆర్ ప్రభుత్వం దుబ్బాకకు చేస్తే. బీజేపీ సాయం కాకి రెట్టంత ఉందని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారానికి, నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ దుబ్బాకు వస్తే వాళ్ల మైకులే ఫెయిల్ అయ్యాయన్న హరీష్ రావు, పరాయి లీడర్లు, పరాయి కార్యకర్తలతో కాంగ్రెస్ మీటింగ్ లు నడుస్తున్నాయని, ప్రజలు అసలే లేరని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పోటీ రెండో స్థానం కోసమేనని ఆయన అన్నారు. తెరాస, కేసీఆర్ లేకపోతే ఉత్తమ్ జై తెలంగాణ అనే వాడా…? అని హరీష్ రావు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news