పేదలను పక్కన పెట్టి… కార్పోరేట్లకు దోచిపెడుతోంది. బీజేపీపై హరీష్ రావు ధ్వజం

-

పేదలను పక్కనపెట్టి కార్పొరేట్లకు పనిచేసి, దోచిపెట్టే పార్టీ బీజేపీ అని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం బావుల వద్ద 40 వేల కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బావుల వద్ద మీటర్ల పెట్టే ప్రసక్తి లేదని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పారని హరీష్ రావు అన్నారు. ప్రాణం పోయిన తెలంగాణలో బోర్ల వద్ద మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇచ్చి… తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ పార్టీ తెలంగాణ కు తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకీ అతిగతి లేదని విమర్శించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామన్నా..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news