ఆయుష్మాన్ భారత్ అమలుపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

-

తెలంగాణ శాసన మండలిలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై ఆర్థిక మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరుతుందని…. ఆరోగ్య శ్రీ ద్వారా 87 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది అందుకే ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్నామన్నారు. గత మే 18 2021 నెల నుండి ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం.మే 18 వతేది నుంచి 1,18,247 మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా చికిత్స అందించామని ప్రకటన చేశారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ రెండు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని… కరోనా, బ్లాక్ ఫంగస్ కు కార్పొరేట్ హాస్పిటల్ లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ లలో వైద్యం అందించామని హరీష్‌ రావు తెలిపారు. వేరే రాష్ట్రాల వారికి మనం ఆరోగ్య శ్రీ డబ్బులు చెల్లించబోమని… gst బకాయులు కేంద్రం నుండి సకాలంలో ఇవ్వడం లేదని మండిపడ్డారు.

కరోనా కారణంగా gst బకాయిలను దఫా దఫాలుగా 2022 వరకు ఇస్తామని కేంద్రం తెలిపిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని 15 ఆర్ధిక సంఘం సూచించింది కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని… ప్యాకేజ్ పై నిర్మల సీతారామన్ ను అడిగితే ఇప్పటి వరకు నిర్మల సీతారామన్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్ట కాలంలో కూడా ఉద్యోగులకు 30 శాతం పీఆర్‌సీ పెంచామన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news