ఆయన దెబ్బతో రష్మిక బాలీవుడ్ మూవీ ఆగినట్టేనా..?

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా పుష్ప సినిమాలో డీ గ్లామరస్ పాత్రలో పోషించినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ పెరగడంతో పాటు బాలీవుడ్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోని ఒకవైపు తెలుగులో వరుస అవకాశాలు పొందుతూనే.. మరొకవైపు బాలీవుడ్ లో కూడా అంతే రేంజ్ లో సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ . ఇక ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈమెకు మరికొన్ని అవకాశాలు వచ్చాయి.

ఇక ఈ క్రమంలోనే యానిమల్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమా కోసం ఈమెకు అవకాశం వచ్చింది. ఈ సినిమాను సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న స్క్రూడీలా సినిమాకి కూడా రష్మిక మందన్న ఓకే చెప్పింది. దర్శకుడు శశాంక్ ఖైథాన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నాడు. ఇక దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది . అయితే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను పక్కకు పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.Karan Johar to announce something exciting! Is it the Tiger Shroff, Rashmika  Mandanna film? - Movies News

బడ్జెట్ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత కరణ్ ఈ సినిమా వర్కౌట్ కాదని నిర్ణయానికి వచ్చారట. ఒకరకంగా చెప్పాలి అంటే రష్మిక బాలీవుడ్ సినిమాని కరణ్ జోహార్ అడ్డుకున్నాడు అనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం హీరో టైగర్ ష్రాఫ్ రూ.35 కోట్లు, రష్మిక మందన్న రూ.4 కోట్లు , సినిమా బడ్జెట్ రూ.140 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లైగర్ సినిమాతో భారీగా దెబ్బతిన్న కరణ్ జోహార్ ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే వార్త వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news