పాతబస్తీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం పోలీసుల భారీ భద్రత

-

పాతబస్తీ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసామన్నారు సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య. బహదూర్ పుర & ఛార్మినార్ వద్ద 1000 మంది పోలీసులతో భద్రత పెట్టామన్నారు. సౌత్ జోన్ 400, నార్త్ జోన్ 400, ఈస్ట్ జోన్ + సెంట్రల్ జోన్ 200 తో భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగే రూట్ మ్యాప్ అంతటా రూప్ ఫోర్స్ & క్విక్ రియాక్షన్ & సి.ఆర్.పి.ఎఫ్ టీం తో సమన్వయం చేసామని తెలిపారు.

పాతబస్తీ సౌత్ జోన్ & ఈస్ట్ జోన్ & సెంట్రల్ జోన్ లో మొత్తం 60 వేలకు పైగా సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. మొత్తం రూట్ మ్యాప్ కి పకడ్బందీ భద్రత ఉందన్నారు డిసిపి సాయి చైతన్య. సెన్సిటివ్ & హైపర్ సెన్సిటివ్ ఏరియాల్లో నిఘా పెంచామని పేర్కొన్నారు. బహదూర్ పుర నుండి చార్మినార్ వరకు 3 కిలో మీటర్లు తమ అధీనంలో ఉంటుందని.. చార్మినార్ నుండి మదిన మీదుగా సాగే యాత్ర కోసం ఆయా జోన్ పోలీస్ లతో సమన్వాయం తో భద్రత ఏర్పాటు చేసామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news