అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

-

పంజాబ్ లోని అమృత్‌సర్ విమానాశ్రయం లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. 6.05 కోట్ల విలువ చేసే అమెరికన్ డాలర్స్ సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయం కు చేరుకున్న ఓ ప్రయాణీకుడిని సెక్యూరిటీ చెక్ వద్ద ప్రయాణీకుడి బ్యాగ్ స్కానింగ్ చేసారు సిఐఎస్ఎఫ్ అధికారులు. లగేజ్ బ్యాగ్ లో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు కనిపించడంతో అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

ప్రయాణీకుడిని తమదైన స్టైల్ లో ప్రశ్నించిన కస్టమ్స్ అధికారులు.. లగేజ్ బ్యాగ్ కింద భాగంలో దాచిన కరెన్సీ గుట్టును రట్టు చేసారు. కరెన్సీ సీజ్ చేసి..ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు. FEMA చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news