జమ్ములో భారీగా కురుస్తున్న మంచు.. నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక

-

నాలుగు రోజులుగా భారీ హిమపాతంతో జమ్ముకశ్మీర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జమ్ము లోయలోని నాలుగు జిల్లాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24 గంటల్లో బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయిలో మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అందువల్ల ఈ నాలుగు జిల్లాల్లో భారీగా మంచు కురిసే ప్రాంతాలలకు ప్రజలు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్‌మార్గ్‌లోని అఫర్వత్‌ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు. అధికారులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news