కూలిన SLBC టన్నెల్ వద్ద రూ.2.36 కోట్లతో హెలికాప్టర్ సర్వే

-

కూలిన SLBC టన్నెల్ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కూలిన SLBC టన్నెల్ వద్ద రూ.2.36 కోట్లతో హెలికాప్టర్ సర్వే చేయనుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ హెలికాప్టర్ సర్వేను నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (NGRI)కి నామినేషన్ ప్రాతిపదికన అప్పగించింది.

Helicopter survey at collapsed SLBC tunnel worth Rs. 2.36 crore
Helicopter survey at collapsed SLBC tunnel worth Rs. 2.36 crore

ఈ హెలికాప్టర్ సర్వే కోసం రూ.2.36 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం… జీవో జారీ చేసింది. ఇది ఇలా ఉండగా ఎస్ఎల్బిసి టన్నెల్ సంఘటన గత మూడు నెలల కిందట జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఈ సంఘటన.. జరగగా 8 మంది సొరంగంలోకి వెళ్లారు. కానీ ఇద్దరి శవాలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయగలిగింది. మిగిలిన డెడ్ బాడీ లు ఎక్కడ దొరకలేదు. అయితే బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news