బాలీవుడ్ తారలను ఫాలో అవుతోన్న మహేష్…!

-

ప్రిన్స్ మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ వెల్లడనుకున్నాం.ఇంట్లోనే కూర్చుని సర్కారువారి పాటకు బాడీని షేప్ చేసుకుంటాడనుకున్నాం.కట్ చేస్తే చివరకు మనోడు కూడా మేడమ్ గారి చలవతో ఫారిన్ ట్రిప్ వేసేస్తున్నాడు. బిటౌన్ తారలను ఫాలో అవుతోన్న ఫస్ట్ సౌత్ హీరోగా మహేష్ మారిపోయాడు. సౌత్ సినీ స్టార్స్ వెకేషన్ పేరుతో అవుట్ డోర్లకు వెల్లడం లేదు.ఉన్న టైమ్ ను ఇప్పటికే కమిటైన నిర్మాతకు కాల్షీట్స్ రూపంలో కేటాయించే ఇన్ టైమ్ కు షూట్ అయ్యేలా చూస్తున్నారు.అయితే తమతో ఉండే ప్రెండ్స్ వలన,లైఫ్ పార్టనర్ వలన మన హీరోలు జెట్ సెట్ గో అంటున్నారు.

ప్రిన్స్ మహేష్ లాక్ డౌన్ టైమ్లో వైఫ్ నమ్రతా,కిడ్స్ తో ఎక్కడికి వెల్లకుండా ఇంటిపట్టునే ఉండిపోయాడు.హోం జిమ్ లోనే బాడీ షేప్ చేసుకున్నాడు.ఇక స్టార్ట్ అవ్వాల్సిన సర్కారువారి తర్వాతి షెడ్యూల్ ఇప్పట్లో లేదని తెలియడంతో హ్యాపీగా కంప్లీట్ ఫ్యామిలీతో కలిపి విదేశాలకు విహార యాత్రకు బయలుదేరాడు.

దాదాపు ఆరు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మహేష్ ఫ్యామిలీకి బాలీవుడ్ తారల వెకేషన్ ట్రిప్ లు డిస్ట్ర్రబ్ చేసాయనే టాక్ నడుస్తుంది. అందుల్లోను వైఫ్ నమ్రతా బాలీవుడ్ తారనే కావడంతో ఆ ఎఫెక్ట్ ఆమెపై గట్టిగానే పడింది.దీనికి తోడు పిల్లలు కూడా అవుటింగ్ కు వెలదామని మారం చేస్తూ ఉండడంతో ఇదిగో ఇలా ట్రిప్ వేస్తున్నారు.అయితే ప్రిన్స్ ఫ్యామిలీ వెకేషన్ ఎక్కడికనేది ఇన్ స్టా పోస్ట్ లో ఎక్కడా రివీల్ చేయలేదు.కనీసం ట్యాగ్స్ లోనైనా క్లూ ఇస్తారనుకుంటే అది లేకుండాపోయింది.పరిశ్రమ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం ఈ ట్రిప్ కశ్చితంగా యూరప్ కే అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news