అమరావతి దెబ్బకు భయపడిపోతున్న హీరోలు…!

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని వ్యవహారంతో ఇప్పుడు టాలివుడ్ స్టార్ హీరోలు కూడా భయపడిపోతున్నారు. మాట్లాడితే ఒక చిక్కు మాట్లాడకపోతే మరో చిక్కు అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాస్తవానికి టాలివుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారే ఉన్నారు. దీనితో వాళ్ళు అమరావతి గురించి స్పందించడం లేదనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తమవుతుంది.

ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో వాళ్ళ సినిమాలను బాన్ చెయ్యాలి అనే డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. తాజాగా ఈ సెగ మహేష్ బాబుని అల్లు అర్జున్ ని తాకింది. అమరావతి ఉద్యమం దెబ్బకు ఇద్దరి ఇళ్ళ ముందు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం రెండు జిల్లాల వసూళ్ళ మీద పడే అవకాశం ఉందని సిని పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

దీనితో టాలివుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు సినిమాలు విడుదల చెయ్యాలి అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. అమరావతి గురించి మాట్లాడాలని భావించినా, వైసీపీ అభిమానులు, ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకత వస్తుందని చూస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తే నాలుగు జిల్లాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో వీలైనంత వరకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news