బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ ఇంట్లో భారీ చోరీ.. రూ. 2.45 కోట్లు మాయం..!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీ న‌గ‌రంలో ఉన్న సోన‌మ్ కుపూర్ ఇంట్లో ఈ భారీ చోరీ జ‌రిగింది. ఈ చోరీలో సోన‌మ్ క‌పూర్.. జ్యువెల్ల‌రీ తో పాటు కొంత వ‌ర‌కు న‌గ‌దు కూడా మాయం అయింద‌ని తెలుస్తుంది. మొత్తంగా రూ. 2.45 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు చోరీ అయిన‌ట్టు స‌మాచారం. కాగ ఈ ఘ‌ట‌న ఫిబ్ర‌వ‌రి 11 వ తేదీన జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 11న చోరీ జ‌ర‌గ‌గా.. ఫిబ్ర‌వ‌రి 23న పోలీసుల‌కు సోన‌మ్ కపూర్ కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశార‌ని పోలీసులు తెలిపారు.

అయితే హై ప్రోఫైల్ కేసు కావ‌డంతో ఢిల్లీ పోలీసులు ర‌హ‌స్యంగా ద‌ర్యాప్తు జ‌రిపారు. దొంగ కొసం ప్ర‌త్యేక స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు చేశారు. సోన‌మ్ క‌పూర్ ఇంట్లో ఉని చేస్తున్న ఉద్యోగులు, డ్రైవ‌ర్లు, తోట‌మాలిల‌ను పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. కాగ చోరీ స‌మ‌యంలో సోన‌మ్ క‌పూర్ ఇంట్లో లేదు. గ‌ర్భ‌వ‌తి కార‌ణంగా.. సోన‌మ్ త‌న తల్లి వ‌ద్ద ఉంటుంది. చోరీ సమ‌యంలో సోన‌మ్ భ‌ర్త ఆనంద్ అహుజా తో పాటు ఆనంద్ త‌ల్లిదండ్రులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news