ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్.. భారీగా చేరుకుంటున్న రైతులు ?

-

ఢిల్లీ సరిహద్దులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ సరిహద్దులకు రైతులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు రైతులు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. ఎలా అయినా రైతుల శిబిరాలు తీసి వేయించాలని ఒక పక్క పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఘాజీపూర్ సరిహద్దుల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు వెళ్లిపోవాలని సరిహద్దుల్లో ఉండే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

farmers
farmers

ఇప్పటికే సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కూడా బంద్ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఒక పక్క రైతుల టెన్షన్ తో పాటు మరో పక్క బాంబు పేలుడు టెన్షన్ కూడా ఢిల్లీ పోలీసులను ఇబ్బంది పెడుతోంది. వీలైనంత త్వరగా రైతులను ఖాళీ చేయించాలని భావనలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. ప్రధానమంత్రి మోడీ నిన్న రైతులకు అనుకూలంగా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఎలా అయినా శిబిరాలను ఖాళీ చేయించాలని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news