కోనసీమలో రచ్చ రచ్చ.. ఎస్పీ వాహనంపై రాళ్లదాడి…

-

ఇటీవల ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల పేర్ల విషయంలో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరి కొందరు వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పేరు మార్చవద్దని, కోనసీమ జిల్లాగానే ఉంచాలని ఓ వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు.

Konaseema: 'కోనసీమ' జిల్లా పేరు మార్పు.. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

కోనసీమ జిల్లానే ముద్దు, వేరే పేరు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకుని కలెక్టరేట్ వద్దకు పరుగులు తీశారు. వీరిని పోలీసులు వెంబడించారు. అయితే.. అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు, యువకులకు ఇరువర్గాలకు గాయాలయ్యాయి. అంతేకాకుండా.. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తృటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news