నాకేం కాలే… క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ మనవడు

-

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు కాలికి ఫ్రాక్చర్ అయిందని ఈ ఉదయం మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆయన కాలుకి ఫ్రాక్చర్ కావడంతో యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అసలు ఆయన నొప్పి కారణంగా నిలబడలేకపోతున్నాడని అన్నారు.

ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడ్డారని ఒక ప్రచారం జరగగా మరి కొందరు గుర్రపు స్వారీ చేస్తుండగా పడి పోయాడని చెబుతున్నారు. ఐతే తన ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హిమాన్షు రావు స్వయంగా స్పందించారు. ఈ ప్రచారాన్ని కొట్టి పారేసిన ఆయన ఈ పుకార్లను నమ్మవద్దని కోరారు. కాలికి ఫ్రాక్చర్ అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కాలికి సాఫ్ట్ టిష్యూ డామేజ్ అయిందని అన్నారు. అంటే కాదు రేపటి కల్లా పరిగెడతానని ఆయన పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై పుకార్లు పుట్టించే సాహసం చేయవద్దని కూడా హిమాన్షు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news