12వ త‌ర‌గ‌తి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకున్న హిమాన్షు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి మనుమడు, మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు మరో అరుదైన ఘట్టాన్ని అందుకున్నాడు. ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు దంపతులు ఆశీర్వదించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి మను మడు, మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలీలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యేయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్ లో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్య క్రమాని కి హిమాన్షు తాతగారు నాయనమ్మలైన సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు, తల్లి దండ్రులు కేటీఆర్‌, శైలిమ, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news