ఖి”లేడీ” పనిమనిషి: రూ. 50 లక్షల దొంగతనం… వాట్సప్ పిక్ తో దొరికిపోయింది !

-

ఇంటి యజమానులు ఎంతో నమ్మకంతో కొందరిని నమ్మి లక్షల విలువైన బంగారం డబ్బు ఇంట్లో ఉన్నా వారికి చనువు ఇస్తూ ఉంటారు. అయితే దీనిని అలుసుగా తీసుకుని కొందరు పనిమనిషి రూపంలో ఉన్న దొంగలు విశ్వాసంగా లేకుండా దొంగతనాలకు చేస్తుంటారు. పూర్తి వివరాలకు వెళ్తే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక ఇంటి యజమాని తన పనిమనిషి రూ. 50 లక్షల బంగారం దొంగతనం జరిగినందని పోలీసులను ఆశ్రయించింది. దొంగతనం జరిగిన తర్వాత పనిమనిషి ఇంట్లోకి రాకపోవడంతో ఏదో కారణంతో రాలేదని అనుకున్నారు యజమానులు. కానీ పనిమనిషి వాట్సాప్ పిక్ లో అచ్చం తన బంగారంలోని ఇయర్ రింగ్స్ నే పెట్టుకోవడంతో అస్సలు విషయం తెలుసుకుంది యజమాని.

దొంగతనం చేసింది తన ఇంటి పనిమనిషి అని కనుక్కుని పోలీసులకు చెప్పింది. దీనితో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పనిమనిషిని అరెస్ట్ చేసి విచారణ చేయగా ఆమె నుండి రూ.50 లక్షల నగలు మరియు రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news