హైదరాబాద్ లో దారుణం… భార్య గొంతు కోసి చంపిన భర్త

-

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాల పేరుతో… అయిన వారిని దూరం చేసుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. అన్యాయంగా అభం శుభం తెలియని వారిని పొట్టన పెట్టుకుంటున్నారు. అంతేకాదు ఈ మధ్య భార్య ని చంపడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. మర్డర్ చేసి.. సూసైడ్ చేసుకున్నట్లు సృష్టిస్తున్నారు కొంత మంది. మరీ కొంత మంది భార్యలను… చంపి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది.

తాజాగా తన భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్ లో చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో కిరణ్ అనే వ్యక్తి… తన భార్య అయిన సుధారాణి ని గొంతు కోసి చంపాడు. అనంతరం చేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే వీరిద్దరికీ నెల కిందే వివాహం జరిగినట్లు సమాచారం అందుతోంది. భార్యపై అనుమానంతో ఈ ఘటనకు ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం సుధారాణి మృతదేహం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఉండగా… పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news