ఐపీఎల్ 14వ మ్యాచ్‌.. చెన్నై టార్గెట్ 165..

-

దుబాయ్‌లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 14వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ 164 ప‌రుగులు చేసింది. మ్యాచ్‌లో హైద‌రాబాద్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా చెన్నై ఫీల్డింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి 164 ప‌రుగులు చేసింది.

hyderabad made 164 runs against chennai in ipl 2020 14th match

హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ల‌లో పీకే గార్గ్ 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 51 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గార్గ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో హైద‌రాబాద్ జ‌ట్టు స్కోరు బోర్డుపై మెరుగైన ల‌క్ష్యాన్ని చెన్నై ఎదుట ఉంచ‌గ‌లిగింది. ఇక హైద‌రాబాద్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్ల‌లో అభిషేక్ శ‌ర్మ (31 ప‌రుగులు, 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌), మ‌నీష్ పాండే (29 ప‌రుగులు, 5 ఫోర్లు)లు రాణించారు. చెన్నై బౌల‌ర్ల‌లో చాహ‌ర్ 2 వికెట్లు తీయ‌గా, శార్దూల్ ఠాకూర్‌, పీయూష్ చావ్లాలు చెరొక వికెట్ తీశారు. మ‌రొక వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది.

Read more RELATED
Recommended to you

Latest news