హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇక ఆ స్టేషన్ లు ఓపెన్ !

-

గ్రేటర్ పరిధిలో మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం శుభవార్త అందించింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో గ‌త మార్చి 22న నిలిచిపోయిన హైద‌రాబాద్ మెట్రో రైలు సేవ‌లు తిరిగి సెప్టెంబర్ 7, 2020 న ప్రారంభ‌మ‌య్యాయి. రేపటి నుంచి ఉదయం 6.30 – రాత్రి 9.30 వరకు మెట్రో రైల్ తిప్పనున్నారు. ప్రస్తుతానికి ఉదయం 7.00 – రాత్రి 9.30 వరకు ట్రైన్ తిప్పుతున్నారు. ఒక మూడు స్టేషన్లు కూడా తెరవలేదు. అందుతున్న సమాచారం మేరకు రేపు అంటే 3 డిసెంబర్ 2020 నుండి ఆ 3 క్లోజ్డ్ స్టేషన్లను అంటే కారిడార్ 1లో ఉన్న భరత్ నగర్ మరియు కారిడార్ 2 లోని ముషీరాబాద్ & గాంధీ హాస్పిటల్ స్టేషన్ లను  ప్రారంభించనుంది మెట్రో యాజమాన్యం.

ప్రయాణికుల డిమాండ్ ని బట్టి మొదటి రైలు ప్రతిరోజూ 0700 గంటలకు బదులుగా 06: 30 కు ప్రారంభమవుతుంది. అయితే చివరి రైలు సమయములో ఎటువంటి మార్పు లేదు. ఇది రాత్రి 9.30 గంటలకు స్తర్తింగ్ టెర్మినల్ స్టేషన్ నుండి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గమ్యం టెర్మినల్ స్టేషన్ కు చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news