5 గురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

-

ఐదుగురు జీఎస్టీ అధికారులపై పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే.. వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయం లో సోదాలు చేశారు జి ఎస్ టి అధికారులు.

సోదాల అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డి ను అక్రమంగా నిర్బంధించిన జి ఎస్ టి అధికారులు… ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భదించిన అధికారుల పై నేషనల్ మహిళ కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

దీంతో నేషనల్ మహిళా కమిషన్ నుండి హైదరాబాద్ పోలీసులకు సిఫార్స్ వచ్చింది. బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు… ఐదుగురు అధికారుల పై కేస్ నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి,ఇసాబెల్లా,ఆనంద్ కుమార్, కుచ్ ల పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. గతంలోనే బొల్లినేని గాంధీ పై సిబిఐ కేసు నమోదు కాగా.. బొల్లినేని గాంధీ , చిలక సుధా ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news