తల్లీ కొడుకులు మద్యం కోసం ఏం చేసారంటే…!

-

మద్యం లేక జనాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. లాక్ డౌన్ లో మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు నరకం చూస్తున్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు మద్యం కోసం కొందరికి పిచ్చి ఎక్కే పరిస్థితి ఉంది. ఇప్పట్లో లాక్ డౌన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. తీసుకున్నా సరే మద్యం షాపులను ఓపెన్ చేసే పరిస్థితి లేదు.

దీనితో ఇళ్ళల్లోనే మద్యం తయారు చేసుకుంటున్నారు జనం. ద్రాక్షారసంతో మద్యం తయారు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇలా మద్యం తయారు చేస్తూ తల్లీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో… రామంతపూర్ చర్చికాలనీలో నివాసముంటున్న పొలిశెట్టి సుధాకర్‌ అనే వ్యక్తి తన తల్లి తెరిహమ్మతో కలిసి ద్రాక్షారసంతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టారు.

ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో వారు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 25 లీటర్ల ఆల్కహాల్ తయారీ ద్రాక్ష ముడిసరుకు టిన్, 5 లీటర్ల ఫుల్ ఆల్కహాల్ టిన్, ఇతర ఖాళీ టిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎప్పుడు నుంచి  తయారుచేస్తున్నారు అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news