‘నేను డొనాల్డ్ ట్రంప్‌ను కాదు’: ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు..!

-

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల గురించి మాట్లాడుతూ, ‘నేను డొనాల్డ్ ట్రంప్ కాదు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేను’ అని శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబందించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, దేశంలో దాదాపు 28 శాతం కరోనా పాజిటివ్ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదైనాయి.

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలా 19 వేలకు పైగా పెరిగిపోయాయి. కరోనా కాటుకు మహారాష్ట్రలో 28, 734 మంది మరణించారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అలాగే మహారాష్ట్రలో పరిస్థితిని గమనించి కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తరువాత లాక్ డౌన్ నియమాలు సడలిస్తామని సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news