నేను మందు తాగలేదు – మంత్రి మల్లారెడ్డి

-

మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా మందు తాగుతూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ఇన్చార్జిగా ఉన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో కలిసి రోజంతా ప్రచారం చేసిన మల్లారెడ్డి.. సాయంత్రానికి చౌటుప్పల్ గ్రామ శివారులోని తన అనుచరులతో మందు పార్టీ చేసుకున్నారు.

తనతో వచ్చిన నేతలతో పాటు లోకల్ కేడర్ కు ఫుల్లుగా మందు పోశారు. ఫుల్ బాటిల్ ని పట్టుకొని గ్లాసులో మందు పోస్తున్న మల్లారెడ్డి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మునుగోడులో తాను బంధువులను కలిస్తే వివాదం చేశారని వెల్లడించారు.

” మంత్రి అయినప్పటినుండి మా బంధువులను కలవలేదు. చాలాకాలం అయిందని వారి ఇంటికి వెళ్లాను. బామ్మర్ది, భావాలను కూడా కలవద్దా? బంధువుల ఇంట్లో కూర్చున్నా తప్పేనా? అయినా నేను మందు తాగలేదు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ అనవసర అద్దాంతం చేస్తున్నాయి. ఎవరు ఫోటో తీశారో నాకు తెలియదు.” అంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news