వంద రోజుల పాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనట్టు భావించడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

“వంద రోజుల పాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనట్టు భావించడం లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఒక‍్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం” అని అన్నారు.గత పాలన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు వెళుతున్నాం. ముందు ముందు ఇంకా బాధ్యతతో అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు దాదాపు 26 కోట్ల మంది మహిళలు ఈ సేవలను విజయవంతంగా ఉపయోగించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్యం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. అదేవిధంగా మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ని అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాల నియామకాలను నియమించే టి ఎస్ ఎస్ పి కి సంబంధించిన స్టాప్ ని ప్రక్షాళన జరిపి నూతనంగా కొత్త స్టాప్ ఏర్పడేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news